Narasimha maha mrityunjaya mantram

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం.............!!

ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు.

*ఉగ్రం వీరం మహావిష్ణుం *
*జ్వలంతం సర్వతోముఖమ్‌*
*నృసింహం భీషణం భద్రం *
*మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం*

నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. 
ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. 
పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది. 

అద్వైత మత స్థాపకులైన శ్రీ శంకరాచార్యులవారిని రెండు సార్లు మృత్యువు నుంచి కాపాడారు స్వామివారు. ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి.

Popular posts from this blog

Hanuman Pooja process